'కాంగ్రెస్‌ కేడర్‌ అప్రమత్తంగా ఉండాలి' | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్‌ కేడర్‌ అప్రమత్తంగా ఉండాలి'

Published Tue, Dec 29 2015 7:02 AM

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. మత శక్తులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ కేడర్‌ అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ 131వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్‌ అడ్డకుని తీరుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement