నేడు భారత్-పాక్ సరిహద్దు దళాల చర్చలు | India-Pakistan Border Force Talks to Start Today | Sakshi
Sakshi News home page

Sep 10 2015 7:19 AM | Updated on Mar 22 2024 11:27 AM

భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య డెరైక్టర్ జనరళ్ల స్థాయి 3 రోజుల చర్చలు గురువారం మొదలు కానున్నాయి. చర్చలకు భారత్ ఆతిథ్యమిస్తుండగా.. పాక్ నుంచి 16 మంది సభ్యుల ప్రతినిధి బృందం బుధవారం అమృత్‌సర్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట బుధవారం మరో రెండు కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకోవటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితుల్లో జరుగుతున్న ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు, సిమాంతర చొరబాట్ల అంశాలను భారత్ లేవనెత్తనుంది. ఏడాదిన్నర కాలం తర్వాత.. భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్), పాకిస్తాన్ రేంజర్స్ అధిపతుల మధ్య ఈ చర్చలు జరగబోతున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement