తెలంగాణలో రైతులందరికీ విద్యుత్‌ కనెక్షన్లు | CM KCR orders to employees over electricity connections to farmers | Sakshi
Sakshi News home page

Oct 26 2016 9:19 AM | Updated on Mar 21 2024 6:45 PM

రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వచ్చే ఏడు నెలల్లోగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్‌ అధికారులకు సూచించారు. దాదాపు ఐదేళ్లుగా రైతులు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఆ ఎదురుచూపులకు స్వస్తి పలికేందుకు.. కనెక్షన్ల మంజూరులో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ విద్యుత్‌ అంశంపై కేసీఆర్‌ సమీక్ష జరిపారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement