రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. వచ్చే ఏడు నెలల్లోగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ అధికారులకు సూచించారు. దాదాపు ఐదేళ్లుగా రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఆ ఎదురుచూపులకు స్వస్తి పలికేందుకు.. కనెక్షన్ల మంజూరులో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ విద్యుత్ అంశంపై కేసీఆర్ సమీక్ష జరిపారు. జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు
తెలంగాణలో రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు
Published Wed, Oct 26 2016 9:19 AM
Advertisement
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement