నిన్నటి వరకు హైదరాబాద్ను వణికించిన వర్షాలు ఇప్పుడు గుంటూరు జిల్లాపై పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేట శివార్లలో రెండు బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ బస్సులోంచి కేకలు పెట్టారు. దాంతో స్థానికులు అక్కడకు వెళ్లి, జాగ్రత్తగా ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే వారి సామాన్లు అన్నీ బస్సులోనే మిగిలిపోయాయి. బస్సు కూడా వాగునీటిలో ఒరిగిపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలోను, పల్నాడు ఎక్స్ప్రెస్ రెడ్డిగూడెంలోను, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ బెల్లంకొండలోను ఆగిపోయాయి.
Sep 22 2016 9:13 AM | Updated on Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement