‘ప్యాకేజీ’పై బీజేపీ ప్రచారం | BJP campaign on the Package | Sakshi
Sakshi News home page

Sep 14 2016 6:54 AM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రత్యేక హోదాకు బదులు అందుకు సమానంగా ఆర్థిక సహాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ’ అంశాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. రానున్న నెల రోజుల్లోగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగసభలు నిర్వహించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించింది. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో తిరుపతి, కోస్తాలో గుంటూరు లేదంటే విజయవాడలో ఈ సభలను నిర్వహించనున్నారు. ప్రాంతాలవారీగా జరిగే ఒక్కొక్క సభకు పార్టీకి చెందిన ఒక్కో కేంద్రమంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement