కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి: భూమన | Sakshi
Sakshi News home page

కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి: భూమన

Published Sun, Nov 13 2016 12:42 PM

శాస్త్రీయత లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకోవడానికి బ్యాంకుల వద్ద సామాన్య ప్రజానీకం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.

Advertisement
Advertisement