‘మంత్రి కామినేని సిగ్గుతో తల దించుకోవాలి’ | Sakshi
Sakshi News home page

‘మంత్రి కామినేని సిగ్గుతో తల దించుకోవాలి’

Published Thu, Dec 8 2016 4:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమలు తీరుపై చర్చించేందుకు సిద్ధమని, మంత్రి కామినేని శ్రీనివాస్‌ సవాల్‌ ను స్వీకరిస్తున్నామని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చర్చకు తేదీ, సమయం, వేదిక రేపు సాయంత్రంలోగా మంత్రి చెప్పాలని సూచించారు. కామినేని బీజేపీ నాయకుడని మర్చిపోయారని, తమ చంద్రబాబు అని సంబోధిస్తూ టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీలో కమీషన్లు రావు కాబట్టే చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైద్యం అందక పేదలు అల్లాడుతున్నారని చెప్పారు.