ఏపీలో ఏసీబీ అధికారుల దూకుడు | Sakshi
Sakshi News home page

ఏపీలో ఏసీబీ అధికారుల దూకుడు

Published Mon, Jan 9 2017 9:21 AM

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఏసీబీ ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. అనంతపురంలో కొడికొండ చెక్‌పోస్ట్‌లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ పై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి రూ.14వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చిత్తూరులో పలమనేరు, నరహరిపేటలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వాణిజ్యపన్నుల కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.