Union Budget 2026
కూ.. చుక్చుక్! ష్.. గప్చుప్
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తీపి చేదులను తలపించింది. గ్రేటర్ నగరానికి కొంత మోదం.. కాసింత ఖేదం అనే పరిస్థితిని ప్రతిబింబించింది. జీహెచ్ఎంసీ గతంలో కోరిన రూ.10,500 కోట్లతో పాటు కొత్తగా ఆశించిన రూ.719 కోట్లకు అతీగతీ లేకుండాపోయింది. మెట్రో రెండో దశకు మొండిచేయి చూపించింది. కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించకపోవడంతో నగర వాసిని నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారులకు రుణాలు అందజేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో నగర వీధి వ్యాపారులకు ఊరటనిచ్చింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్కు ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. జలమండలి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. బ్యాటరీల ధరలు తగ్గనుండటంతో గ్రేటర్లో ఈవీల విక్రయాలు భారీగా పెరగనున్నట్లు అంచనా. క్యాన్సర్, మధుమేహం తదితర దీర్ఘకాలిక రోగులకు సంబంధించి 17 రకాల ఔషధాల ధరలు తగ్గనుండటంతో నగరంలోని సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. రైళ్ల వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణం సమయం 12 గంటలకు పైగా ఉంది. ప్రస్తుతం చార్మినార్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 6 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరితే చెన్నైకి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్– బెంగళూర్, హైదరాబాద్– పుణె నగరాల మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు పైగా ఉంది. ఈ మూడు రూట్లలో హైస్పీడ్ కారిడార్లను నిర్మిస్తే ప్రయాణ సమయం సగానికి తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాటరీల ధరలు తగ్గనున్న నేపథ్యంలో గ్రేటర్లో ఈవీల విక్రయాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే నగరంలో 2.5 లక్షలకుపైగా అన్ని రకాల ఈవీలు టాప్గేర్లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా బ్యాటరీల ధరలు తగ్గితే వీటి అమ్మకాలు ఊపందుకోనున్నాయి. సాధారణంగా ఈవీలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ బ్యాటరీల ధరలు, అరకొర విద్యుత్ చార్జింగ్ సదుపాయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాటరీ ధరల తగ్గింపు కొంత మేరకు ప్రోత్సాహకంగా ఉంటుంది. బైక్లపై గరిష్టంగా రూ.10 వేలు, కార్లు, ఇతర వాహనాలపై రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు తగ్గే అవకాశాలున్నాయి. నగరంలో ప్రస్తుతం 2.05 లక్షల ద్విచక్ర వాహనాలు, మరో 45 వేలకు పైగా కార్లు, ఆటోలు, కమర్షియల్ వాహనాలున్నట్లు అంచనా. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనున్నాయి. మెట్రోకు మొండిచేయి.. జీహెచ్ఎంసీకి నిరాశహైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం మొండి చేయి చూపించింది. కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి నిధుల కేటాయింపులు జరగలేదు. రెండో దశలో చేపట్టనున్న 76.4 కి.మీ మొదటి 5 లేన్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద మూడు మార్గాల్లో నిర్మించనున్న 86.1 కి.మీ.కారిడార్లకు మరో రూ.19,759 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఇప్పటికే చెన్నై, పుణె, ఢిల్లీ నగరాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం సముచితమైన ప్రోత్సాహాన్ని, తన వాటా నిధులను అందజేస్తోంది. హైదరాబాద్ మెట్రోపై ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని 10,050 చ.కి.మీ.పరిధిలో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.4,5000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకూ కేంద్రం స్పందించలేదు. కేంద్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ ఆశ నెరవేరలేదు. గతంలో కోరిన రూ.10,500 కోట్లు.. కొత్తగా ఆశించిన రూ.719 కోట్ల అంశం బడ్జెట్ కాపీలో కనిపించలేదు. ఆర్థిక సంఘం నిధులు, గృహనిర్మాణాల కింద అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.జలమండలికి భరోసాకేంద్ర బడ్జెట్లో నీటి సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థల బలోపేతానికి పెద్దపీట వేయడంతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు (జలమండలి) ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో పాటు అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించడం జలమండలికి ఊరటనిచ్చే అంశం. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య రంగాల కోసం కేంద్రం ప్రకటించిన కొత్త నిధి, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన ‘ఆర్థిక ఊతం’గా మారనుంది. అమృత్ 2.0 పథకం కింద నగరంలో కొత్తగా చేపట్టే మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణానికి నిధులు అందనున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) ద్వారా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎస్టీపీలకు కూడా కేంద్రం చేయూత లభించనుంది. మరోవైపు, వర్షాకాలంలో నగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రతిపాదించిన ‘సమీకృత స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు’కు సైతం ఈ నిధుల నుంచి వాటా దక్కే అవకాశం ఉంది. అలాగే ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ జలమండలికి వరంగా మారనుంది. నగరంలో తాగునీటి నెట్వర్క్ విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థల ఆధునికీకరణ పనులు వేగవంతం కానున్నాయి.వీధి వ్యాపారుల్లో ఆశ పీఎం స్వనిధి స్కీం పొడిగింపు ద్వారా గ్రేటర్లోని వీధి వ్యాపారులకు తొలి విడత రూ.15వేలు, రెండో విడత రూ.25 వేలు, మూడో విడత రూ.50వేలు రుణాలిస్తారు. నిరీ్ణత వ్యవధిలో చెల్లించే వారికి సబ్సిడీ ఉంటుంది. సకాలంలో రెండో విడత చెల్లించిన వారికి రూ. 30వేల పరిమితి వరకు క్రెడిట్ కారులిస్తారు. వడ్డీ లేకుండా అత్యవసరంలో ఉపయోగపడుతుంది. రూ.లక్ష కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్కు ప్రయోజనం కలిగేందుకు అవకాశం ఉంది. తగ్గనున్న ఔషధ ధరలు.. 30 లక్షల మందికి మేలుక్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగులు వినియోగించే 17 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా నగరంలో సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. నగరంలో 1.5 కోట్ల జనాభా ఉండగా.. ఇందులో సుమారు 21 శాతం మంది మధుమేహులున్నట్లు అంచనా. నగరంలోని ప్రముఖ కేన్సర్ ఆసుపత్రి ఎంఎన్జేకు ఏటా పది వేల మంది కొత్త రోగులు వస్తున్నారు. అదే సమయంలో ఏటా మరో 1.10 లక్షల మందికి ఫాలోఅప్ చికిత్సలు అందుతున్నాయి. ఇతర ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్న వారు ఈ సంఖ్యకు అదనం. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. చికిత్సల అనంతరం రెగ్యులర్ ఫాలోఅప్లో భాగంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, బీమా వంటివి ఉంటే ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో ఔషధ ధరలు తగ్గించడం వల్ల రోగులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశముంది. ఎంతో ప్రోత్సాహకరంబ్యాటరీల ధరలు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఈవీల ధరలు కూడా తగ్గుతాయి. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ బైక్ల వినియోగంలో హైదరాబాద్ టాప్లో ఉంది. రానున్న రోజుల్లో ఈవీల వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇందుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జింగ్ సదుపాయాన్ని పెంచాల్సిన అవసరముంది. – సంధ్య, ఈవీ డీలర్
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్కప్ మ్యాచ్లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ప్లేకి రెడీ అయిపోయారు. కానీ... కెప్టెన్ మోదీ తమది టి–20 ధనాధన్ కాదని.. సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఫుల్గార్డ్తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్... ఇది లాంగ్టర్మ్ ఇన్నింగ్స్’’.ఇన్కమ్ట్యాక్స్ పిచ్ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్. కాకపోతే టీసీఎస్, టీడీఎస్ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్ అసెట్స్కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్ ఇచ్చారు. వన్టైమ్ డిస్క్లోజర్ అనేది ఓ వారి్నంగ్. అంటే... నోబాల్గా ప్రకటించిన క్లీన్బౌల్డ్ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్ పార్కులు, రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ, ఎల్రక్టానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్తోనైనా రన్రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది. ఇవీ చదవండి:రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్అదే పిచ్.. కాస్త రిలీఫ్ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులునిధుల సిక్సర్విలేజ్.. విన్నర్
ఫ్యూచర్స్ ట్రేడర్లపై ఎస్టీటీ గూగ్లీ
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని (ఎస్టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియంపై, ఆప్షన్స్ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్ ఈక్విటీ మార్కెట్పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్ ఉంటున్న డెరివేటివ్ ట్రేడింగ్నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అతి స్పెక్యులేటివ్ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్ విక్రయంపై ఎస్టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయంపై ఎస్టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం లెమన్ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ సింఘాల్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్అండ్వో ట్రేడింగ్కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్ అనంతరం కాన్ఫరెన్స్లో నిర్మలా సీతారామన్ వివరించారు. మార్కెట్లు డౌన్.. ఎస్టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్ సంబంధ స్టాక్స్ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈలో ఎంసీఎక్స్ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్), ఏంజెల్ వన్ స్టాక్ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి. ఎఫ్పీఐలకు ప్రతికూలం.. సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్ ఫండ్స్కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాశ్ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. ఫండమెంటల్స్ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ ఎఫ్అండ్వో ఇన్వెస్టర్లను ఎస్టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్ పోర్ట్ఫోలియో పీఎంఎస్ సహ–వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు.
నిధుల సిక్సర్
న్యూఢిల్లీ : పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రతిపాదించింది. అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా కొత్త ఆయుధాలు, ఎయిర్క్రాఫ్ట్లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. ‘ఆపరేషన్ సిందూర్’చరిత్రాత్మక విజయం నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే తమ దృఢ సంకల్పానికి మూలధన సేకరణ సహా రక్షణ రంగ బడ్జెట్ పెంపు మరింత ఊతం ఇచి్చందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.5,53,668 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు రూ.1.80 లక్షల కోట్లతో పోల్చుకుంటే మూలధన వ్యయం రూ.39 వేల కోట్లు పెంచింది. అయితే 2025–26 సంవత్సరానికి సవరించిన మూలధన వ్యయాన్ని రూ.1,86,454 కోట్లుగా అంచనా వేశారు. తాజా మూలధన వ్యయంలో యుద్ధ విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ.53,733 కోట్లు, నౌకాదళం కోసం రూ.25,023 కోట్లు కేటాయించారు. రూ.1,71,338 కోట్ల పింఛన్లతో కలిపి రెవెన్యూ వ్యయాన్ని రూ.5,53,668 కోట్లుగా చూపించారు. కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పౌర, శిక్షణ విమానాల తయారీకి అవసరమైన కాంపొనెంట్లు, విడిభాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. రక్షణ రంగ పరిశ్రమలకు.. విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాలింగ్కు అవసరమైన విడిభాగాలపై బీసీడీ రద్దును ప్రతిపాదించారు. రక్షణ రంగ వైమానిక పరిశ్రమకు ఈ రెండు నిర్ణయాలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో అత్యాధునికయుద్ధరీతులపై కేంద్రందృష్టి పెట్టింది.మాజీ సైనికుల సీహెచ్ఎస్కు రూ.12,100కోట్లు మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (సీహెచ్ఎస్) కోసం రూ.12,100 కోట్లు ప్రతిపాదించామని రాజ్నాథ్ చెప్పారు. భద్రత, అభివృద్ధి, స్వయం సమృద్ధి మధ్య సమతూకాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని అన్నారు. 2026–27 నాటికి అంచనా వేస్తున్న జీడీపీలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 2 శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మిలటరీ ఆధునీకరణతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు, వనరుల సముచిత వినియోగానికి వీలుగా క్రమబద్ధమైన సేకరణపై రక్షణ బడ్జెట్ దృష్టి పెడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా సాయుధ దళాల బడ్జెట్పై దేశ రక్షణ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ఆధునీకరణ, బలోపేతానికి దేశం కట్టుబడి ఉందనే విషయాన్ని రక్షణ బడ్జెట్ ప్రస్ఫుటం చేసిందని థాలేస్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అంకుర్ కనగ్లేకర్ అన్నారు. త్రివిధ దళాల ఆధునీకరణే లక్ష్యం: రక్షణ మంత్రి త్రివిధ దళాల ఆధునీకరణే ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశమనిరాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.85 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది సుమారు 24 శాతం అధికమని పేర్కొన్నారు. ఈ పెంపుదలతో దేశ మిలటరీ సామర్థ్యం మరింత శక్తివంతం అవుతుందని అన్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రాధాన్యత ఇచి్చనట్లు తెలిపారు. మ్యాచ్ సమ్మరీమిగతా విషయాల్లో ఎంత ‘డిఫెన్స్’ ఆడినా... డిఫెన్స్ రంగం విషయానికి వచ్చేసరికి నో డిఫెన్స్. ఎందుకంటే భద్రతపై రాజీ ఉండకూడదన్నది ప్రభుత్వ పాలసీ. అందుకే... రక్షణ రంగం సేఫ్ ప్లేను వదిలి నిధుల సిక్సర్ కొట్టింది. రూ.7.84 లక్షల కోట్ల రికార్డు కేటాయింపుతో కేంద్రం బంతిని నేరుగా బౌండరీ దాటించింది. చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కొట్టిన ఈ షాట్ కేవలం స్కోర్ పెంచడానికి కాదు, మ్యాచ్ను కంట్రోల్లోకి తీసుకురావడానికి. మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, ఆధునిక మిలటరీ హార్డ్వేర్తో దేశ రక్షణ విషయంలో ఎంత హిట్టింగ్కైనా సిద్ధమని మోదీ సర్కారు స్పష్టంగా చెప్పింది. ఆపరేషన్ సిందూర్’ తర్వాత సన్నద్ధతకు మరింత పదునుపెట్టిన ఈ బడ్జెట్... డిఫెన్స్లో కాదు, అగ్రెసివ్ ఫీల్డ్ సెటప్తో ఆడుతున్న స్పష్టమైన సంకేతం.
వీడియోలు
గోల్డ్ రూ.21 వేలు, వెండి లక్షన్నర పతనం.. తులం బంగారం ఎంతంటే..!
మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్
దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి
మీకోసమే.. ఆపిల్ ల్యాప్ టాప్ చౌక
మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!
ఇక సిలిండర్లతో పరేషాన్ వద్దు... 5 బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ లు
ఒక్క రోజులో 10 లక్షల కోట్లు ఆవిరి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..
ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా.. 100 షేర్లకు 1000 షేర్లు ఫ్రీ..

