Union Budget 2026
బెంగాల్కు కొత్తగా సరుకు రవాణా కారిడార్
పశ్చిమబెంగాల్, గుజరాత్ మధ్య వేగవంతమైన సరుకు రవాణా లక్ష్యంగా సరికొత్త కారిడార్ను ఆర్థికమంత్రి నిర్మల ఆదివారం బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘సమీకృత ఈశాన్య భారత పారిశ్రామిక కారిడార్’లో భాగంగా పశ్చిమబెంగాల్లోని డంకునీ నుంచి గుజరాత్లోని సూరత్కు నూతన సరుకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు. బెంగాల్లోని దుర్గాపూర్ కేంద్రంగా ఈ కారిడార్ను విస్తరిస్తామని చెప్పారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పర్యాటక పథకమైన ‘పూర్వోదయ విజన్’లో భాగంగా మరింత అభివృద్ధి చేస్తామని నిర్మల వెల్లడించారు.డంకునీ సూరత్ ఫ్రీట్ కారిడార్ అనేది పర్యావరణ అనుకూలమైనదేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ఖర్చులనూ భారీగా తగ్గిస్తుందని నిర్మల పేర్కొన్నారు. నదీజల మార్గాల గుండా జరిగే సరకు రవాణాను సమీకృత కారిడార్లతో అనుసంధానించి బెంగాల్ పారిశ్రామికాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని నిర్మల తెలిపారు. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి మరో మూడునెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ బెంగాల్కు మోదీ సర్కార్ వరాల జల్లు కురిపించడం గమనార్హం.పూర్వోదయ రాష్ట్రాలుగా పిలుచుకునే బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ఆమె తెలిపారు. 4,000 ఎలక్ట్రిక్ బస్సుల అందజేతతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి పెంపు, ఆయా రాష్ట్రాల మధ్య జనం, వస్తూత్పత్తుల రవాణాపై దృష్టిపెట్టామని ఆమె వెల్లడించారు.విమర్శించిన తృణమూల్ కాంగ్రెస్రాష్ట్రానికి కొత్తగా సరుకు రవాణా కారిడార్ తెస్తామన్న నిర్మల నిర్ణయంపై బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ‘పాత ప్రతిపాదనలకే కొత్త తాయిలాల పొట్లంలో కట్టి ఇస్తున్నారు. నిధుల మంజూరును గాలికొదిలేసి కేవలం కాగితాలకు పరిమితమయ్యే వాగ్దానాలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ఎత్తుగడ. గత ఐదేళ్లుగా ఇదే చూస్తున్నాం.బెంగాల్కు మోదీ సర్కార్ కేంద్రనిధులపై శ్వేతపత్రం జారీచేసే దమ్ముందా? 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్క కూలీకి అయినా ప్రత్యక్ష బదిలీ పథకం(ఈబీటీ) ద్వారా నగదు ఇచ్చినట్లు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం చేస్తా’ అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు.ఎన్నికల వ్యూహంగా అభివర్ణించిన విశ్లేషకులుఅభివృద్ధి అని చెబుతున్నా వాస్తవానికి తాజా కేటాయింపులు కేవలం ఎన్నికల ఎత్తు గడగా భావించవచ్చని ఎన్నికల వ్యూహకర్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ భారీ కేటాయింపులు చేస్తోందని వారు వ్యాఖ్యానించారు. ‘‘ ఎన్నికలున్న రాష్ట్రాలకు బడ్జెట్లో భారీ వడ్డనలు ఉండటం ఇటీవలికాలంలో ఒక సంప్రదాయంగా మారింది. ఈ కేటాయింపులు వాస్తవాలో కాదో గుర్తెరిగి తదుపరి ఎన్నికల్లో ఓటేసే స్పృహ ఓటర్లకు ఉండాల్సిందే’’ అని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
కూ.. చుక్చుక్! ష్.. గప్చుప్
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తీపి చేదులను తలపించింది. గ్రేటర్ నగరానికి కొంత మోదం.. కాసింత ఖేదం అనే పరిస్థితిని ప్రతిబింబించింది. జీహెచ్ఎంసీ గతంలో కోరిన రూ.10,500 కోట్లతో పాటు కొత్తగా ఆశించిన రూ.719 కోట్లకు అతీగతీ లేకుండాపోయింది. మెట్రో రెండో దశకు మొండిచేయి చూపించింది. కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించకపోవడంతో నగర వాసిని నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారులకు రుణాలు అందజేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో నగర వీధి వ్యాపారులకు ఊరటనిచ్చింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్కు ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. జలమండలి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. బ్యాటరీల ధరలు తగ్గనుండటంతో గ్రేటర్లో ఈవీల విక్రయాలు భారీగా పెరగనున్నట్లు అంచనా. క్యాన్సర్, మధుమేహం తదితర దీర్ఘకాలిక రోగులకు సంబంధించి 17 రకాల ఔషధాల ధరలు తగ్గనుండటంతో నగరంలోని సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. రైళ్ల వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణం సమయం 12 గంటలకు పైగా ఉంది. ప్రస్తుతం చార్మినార్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 6 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరితే చెన్నైకి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్– బెంగళూర్, హైదరాబాద్– పుణె నగరాల మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు పైగా ఉంది. ఈ మూడు రూట్లలో హైస్పీడ్ కారిడార్లను నిర్మిస్తే ప్రయాణ సమయం సగానికి తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాటరీల ధరలు తగ్గనున్న నేపథ్యంలో గ్రేటర్లో ఈవీల విక్రయాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే నగరంలో 2.5 లక్షలకుపైగా అన్ని రకాల ఈవీలు టాప్గేర్లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా బ్యాటరీల ధరలు తగ్గితే వీటి అమ్మకాలు ఊపందుకోనున్నాయి. సాధారణంగా ఈవీలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ బ్యాటరీల ధరలు, అరకొర విద్యుత్ చార్జింగ్ సదుపాయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాటరీ ధరల తగ్గింపు కొంత మేరకు ప్రోత్సాహకంగా ఉంటుంది. బైక్లపై గరిష్టంగా రూ.10 వేలు, కార్లు, ఇతర వాహనాలపై రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు తగ్గే అవకాశాలున్నాయి. నగరంలో ప్రస్తుతం 2.05 లక్షల ద్విచక్ర వాహనాలు, మరో 45 వేలకు పైగా కార్లు, ఆటోలు, కమర్షియల్ వాహనాలున్నట్లు అంచనా. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనున్నాయి. మెట్రోకు మొండిచేయి.. జీహెచ్ఎంసీకి నిరాశహైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం మొండి చేయి చూపించింది. కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి నిధుల కేటాయింపులు జరగలేదు. రెండో దశలో చేపట్టనున్న 76.4 కి.మీ మొదటి 5 లేన్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద మూడు మార్గాల్లో నిర్మించనున్న 86.1 కి.మీ.కారిడార్లకు మరో రూ.19,759 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఇప్పటికే చెన్నై, పుణె, ఢిల్లీ నగరాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం సముచితమైన ప్రోత్సాహాన్ని, తన వాటా నిధులను అందజేస్తోంది. హైదరాబాద్ మెట్రోపై ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని 10,050 చ.కి.మీ.పరిధిలో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.4,5000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకూ కేంద్రం స్పందించలేదు. కేంద్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీ ఆశ నెరవేరలేదు. గతంలో కోరిన రూ.10,500 కోట్లు.. కొత్తగా ఆశించిన రూ.719 కోట్ల అంశం బడ్జెట్ కాపీలో కనిపించలేదు. ఆర్థిక సంఘం నిధులు, గృహనిర్మాణాల కింద అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.జలమండలికి భరోసాకేంద్ర బడ్జెట్లో నీటి సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థల బలోపేతానికి పెద్దపీట వేయడంతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు (జలమండలి) ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. జల్ జీవన్ మిషన్ పొడిగింపుతో పాటు అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించడం జలమండలికి ఊరటనిచ్చే అంశం. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య రంగాల కోసం కేంద్రం ప్రకటించిన కొత్త నిధి, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన ‘ఆర్థిక ఊతం’గా మారనుంది. అమృత్ 2.0 పథకం కింద నగరంలో కొత్తగా చేపట్టే మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణానికి నిధులు అందనున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) ద్వారా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎస్టీపీలకు కూడా కేంద్రం చేయూత లభించనుంది. మరోవైపు, వర్షాకాలంలో నగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రతిపాదించిన ‘సమీకృత స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు’కు సైతం ఈ నిధుల నుంచి వాటా దక్కే అవకాశం ఉంది. అలాగే ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ జలమండలికి వరంగా మారనుంది. నగరంలో తాగునీటి నెట్వర్క్ విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థల ఆధునికీకరణ పనులు వేగవంతం కానున్నాయి.వీధి వ్యాపారుల్లో ఆశ పీఎం స్వనిధి స్కీం పొడిగింపు ద్వారా గ్రేటర్లోని వీధి వ్యాపారులకు తొలి విడత రూ.15వేలు, రెండో విడత రూ.25 వేలు, మూడో విడత రూ.50వేలు రుణాలిస్తారు. నిరీ్ణత వ్యవధిలో చెల్లించే వారికి సబ్సిడీ ఉంటుంది. సకాలంలో రెండో విడత చెల్లించిన వారికి రూ. 30వేల పరిమితి వరకు క్రెడిట్ కారులిస్తారు. వడ్డీ లేకుండా అత్యవసరంలో ఉపయోగపడుతుంది. రూ.లక్ష కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్కు ప్రయోజనం కలిగేందుకు అవకాశం ఉంది. తగ్గనున్న ఔషధ ధరలు.. 30 లక్షల మందికి మేలుక్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగులు వినియోగించే 17 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా నగరంలో సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. నగరంలో 1.5 కోట్ల జనాభా ఉండగా.. ఇందులో సుమారు 21 శాతం మంది మధుమేహులున్నట్లు అంచనా. నగరంలోని ప్రముఖ కేన్సర్ ఆసుపత్రి ఎంఎన్జేకు ఏటా పది వేల మంది కొత్త రోగులు వస్తున్నారు. అదే సమయంలో ఏటా మరో 1.10 లక్షల మందికి ఫాలోఅప్ చికిత్సలు అందుతున్నాయి. ఇతర ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్న వారు ఈ సంఖ్యకు అదనం. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. చికిత్సల అనంతరం రెగ్యులర్ ఫాలోఅప్లో భాగంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, బీమా వంటివి ఉంటే ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో ఔషధ ధరలు తగ్గించడం వల్ల రోగులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశముంది. ఎంతో ప్రోత్సాహకరంబ్యాటరీల ధరలు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఈవీల ధరలు కూడా తగ్గుతాయి. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ బైక్ల వినియోగంలో హైదరాబాద్ టాప్లో ఉంది. రానున్న రోజుల్లో ఈవీల వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇందుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జింగ్ సదుపాయాన్ని పెంచాల్సిన అవసరముంది. – సంధ్య, ఈవీ డీలర్
నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్కప్ మ్యాచ్లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ప్లేకి రెడీ అయిపోయారు. కానీ... కెప్టెన్ మోదీ తమది టి–20 ధనాధన్ కాదని.. సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్తోనే అనుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలిచ్చారు. తమ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఫుల్గార్డ్తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని సాధిస్తామంటూ రెండు దశాబ్దాల తరువాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. వీరబాదుడు లేదు.. రిస్కీ షాట్లు లేనే లేవు. బౌండరీలు, సిక్సర్లు అస్సలే లేవు. ప్రతి బంతినీ పద్ధతిగా ఆడుతూ సింగిల్స్కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్ను మరిపించారు. కళ్లు చెదిరే షాట్లు అక్కర్లేదు... క్రీజ్లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒక్కటే.. ‘నో హిట్టింగ్.. ఓన్లీ డిఫెన్స్... ఇది లాంగ్టర్మ్ ఇన్నింగ్స్’’.ఇన్కమ్ట్యాక్స్ పిచ్ ఏమాత్రం మారలేదు. అవే శ్లాబ్స్. కాకపోతే టీసీఎస్, టీడీఎస్ విషయాల్లో చిన్నచిన్న ఉపశమనాలిచ్చారు. ఎన్నారైలు, ఫారిన్ అసెట్స్కు సంబంధించి పాత తప్పులు దిద్దుకోవటానికి కొన్ని ఫ్రీహిట్స్ ఇచ్చారు. వన్టైమ్ డిస్క్లోజర్ అనేది ఓ వారి్నంగ్. అంటే... నోబాల్గా ప్రకటించిన క్లీన్బౌల్డ్ అన్నమాట. 7 రంగాల్లో తయారీ సామర్థ్యాన్ని పెంచటం... 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు అంటూ మోదీ ‘7’వ నంబర్లో వచ్చే ధోనీ, కపిల్ వంటి కెప్టెన్ల స్థాయిని కళ్లకు కట్టారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, బయోఫార్మా శక్తి, కెమికల్ పార్కులు, రేర్ ఎర్త్ కారిడార్లు, కంటైనర్ తయారీ, ఎల్రక్టానిక్ కాంపోనెంట్ల తయారీ వంటి పథకాలన్నీ మున్ముందు స్కోర్బోర్డును ముందుకు తీసుకెళ్లబోయే షాట్లు. ఇన్ని ఒత్తిళ్ల నడుమ... ద్రవ్య లోటును 4.3 శాతానికే పరిమితం చేస్తామంటూ... సింగిల్స్తోనైనా రన్రేటు మాత్రం పడిపోకుండా చూసుకున్నారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే... ఎస్టీటీ రూపంలో మోదీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150 శాతం, ఆప్షన్లపై 50 శాతం పెంచారు. మార్కెట్లకిది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికైతే బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తుంది. ఇవీ చదవండి:రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్అదే పిచ్.. కాస్త రిలీఫ్ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులునిధుల సిక్సర్విలేజ్.. విన్నర్
ఫ్యూచర్స్ ట్రేడర్లపై ఎస్టీటీ గూగ్లీ
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని (ఎస్టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియంపై, ఆప్షన్స్ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్ ఈక్విటీ మార్కెట్పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్ ఉంటున్న డెరివేటివ్ ట్రేడింగ్నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అతి స్పెక్యులేటివ్ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్ విక్రయంపై ఎస్టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయంపై ఎస్టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం లెమన్ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ సింఘాల్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్అండ్వో ట్రేడింగ్కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్ అనంతరం కాన్ఫరెన్స్లో నిర్మలా సీతారామన్ వివరించారు. మార్కెట్లు డౌన్.. ఎస్టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్ సంబంధ స్టాక్స్ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈలో ఎంసీఎక్స్ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్), ఏంజెల్ వన్ స్టాక్ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి. ఎఫ్పీఐలకు ప్రతికూలం.. సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్ ఫండ్స్కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాశ్ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. ఫండమెంటల్స్ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ ఎఫ్అండ్వో ఇన్వెస్టర్లను ఎస్టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్ పోర్ట్ఫోలియో పీఎంఎస్ సహ–వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు.
వీడియోలు
శ్రావణమాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
10 లక్షల పెట్టుబడి..1.25 కోట్లు లాభం.. HDFC మ్యూచువల్ ఫండ్ అద్భుతం
ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. PF ఖాతా మెర్జ్ చేయకపోతే భారీ నష్టం
రూ.300తో జియో మెంబర్షిప్.. ఇక రీఛార్జ్ టెన్షన్ లేదు
ఐఫోన్ 18 ప్రో.. అప్డేట్ అదిరింది కొత్త వెర్షన్ ఫీచర్స్ ఇవే..
బంగారం ధరలో సడన్ మార్పు.. తులం ఎంతంటే?
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
ఐఫోన్ 18 ప్రో.. అప్డేట్ అదిరింది.. కొత్త వెర్షన్ ఫీచర్స్ ఇవే..
SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే
‘ఎంపీ డెవలపర్స్’ బ్రాండ్ అంబాసిడర్గా సమంత

