ఓర్వకల్లు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలో గల విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా, జాతీయ రహదారిపై వెళ్లుతున్న కారు బోల్తా పడగా, ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సునీల్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇదృష్బాషా(56), తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా, మర్గంమధ్యలో నన్నూరు సమీపాన తన కుమారుడు షంషీర్ఖాజా కారు నడుపుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇదృష్బాషా తలకు బలమైన రక్తగాయం కావడంతో హైవే అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


