గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

జమ్మూ నారాయణపురం రోడ్డులో నిలిచిన ట్రాఫిక్‌

● నేలకూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ● నిలిచిన విద్యుత్‌ సరఫరా ● రాకపోకలకు అంతరాయం

విజయనగరం/గంటస్తంభం/తెర్లాం/గుర్ల:

విజయనగరం జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, పిడిగుల శబ్దాలతో జనం భీతిల్లిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఇళ్ల రేకులు, హోర్డింగ్‌లు ఎగిరిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. రాకపోకలు స్తంభించాయి.

● విజయనగరం దాసన్నపేట ప్రాంతంలో విద్యుత్‌ స్తంభాలు ధ్వంసం కావడంతో కొంతసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అధికారులు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు.

● తెర్లాం మండలంలోని తెర్లాం–ఆమిటి రోడ్డులో పలుచోట్ల చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. వీఆర్వో డి.రాము ఇచ్చిన సమాచారం మేరకు మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌ గొంగాడ సత్యనారాయణ, తెర్లాం ఎంపీటీసీ సభ్యుడు జి.ఆనందరావు పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలు క్రమబద్ధీకరించారు.

● గుర్ల మండలం చింతలపేటలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్‌ స్తంభం పడిపోయింది. మన్యపురిపేటలో షెడ్‌పై చెట్టు పడింది. గరివిడి –విజయనగరం ప్రధాన రోడ్డుపై గుర్ల వద్ద తాటిచెట్లు పడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

● విజయనగరం అయ్యకోనేరు ఉత్తర, దక్షిణ నాలా ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగడంతో అంధకారం అలముకుంది. వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో చెట్టు రహదారికి అడ్డంగా పడిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement