అమ్మవారిని దర్శించుకున్న బొత్స, మజ్జి
చీపురుపల్లి: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం అమ్మవారి జాతర ప్రారంభమవ్వడంతో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలతో దర్శ నానికి వచ్చారు. దర్శనానికి వచ్చిన వారికి దేవదా య శాఖ, ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి, మజ్జి సిరిసహస్ర, ప్రదీప్ దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న బొత్స, మజ్జి


