కబడ్డీ జాతీయ పోటీలకు విశాఖ క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ జాతీయ పోటీలకు విశాఖ క్రీడాకారులు

Mar 19 2025 1:20 AM | Updated on Mar 19 2025 1:19 AM

ఎంవీపీకాలనీ: బీహార్‌లో జరగనున్న 34వ సబ్‌ జూనియర్‌ జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలకు విశాఖ క్రీడాకారులు ఎంపికై నట్లు విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాదరెడ్డి మంళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్‌ ఇంటిగ్రేట్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన 34వ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బాలురు, బాలికల కబడ్డీ పోటీల్లో విశాఖ క్రీడాకారులు సత్తాచాటారు. బాలుర విభాగంలో పల్లి శ్రీనివాసులు(గాజువాక), బాలికల విభాగంలో పేట ద్రాక్షాయణి(పెందుర్తి) రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. మన రాష్ట్రం తరఫున బీహార్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొనే బాలురు, బాలికల జట్లకు వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డితో పాటు జాయింట్‌ సెక్రటరీ సీహెచ్‌ గోవిందు, కోశాధికారి లక్ష్మణరావు, జాతీయ క్రీడాకారులు వైవీ శ్రీనివాస్‌, వి.కనకరాజు తదితరులు అభినందించారు.

కబడ్డీ జాతీయ పోటీలకు విశాఖ క్రీడాకారులు 1
1/1

కబడ్డీ జాతీయ పోటీలకు విశాఖ క్రీడాకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement