విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

Jun 22 2025 7:21 AM | Updated on Jun 22 2025 7:21 AM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

షాద్‌నగర్‌: ఉపాధ్యాయులు విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్ల శ్రీకాంత్‌ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలన్నారు. వారితో పనులు చేయించడం సరికాదన్నారు. ఇటీవల నేరేళ్లపల్లి పాఠశాలలో విద్యార్థులతో మూత్రశాలలు కడిగించడం, పాటిగడ్డలో ఉపాధ్యాయులు విధులకు సెలవు పెట్టి సొంత పనులకు వెళ్లడం వెళ్ళడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతారన్నారు. అటువంటి ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు శివశంకర్‌, ఆదిల్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement