వ్యాపారవేత్తలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తలుగా ఎదగాలి

Jun 22 2025 7:21 AM | Updated on Jun 22 2025 7:21 AM

వ్యాపారవేత్తలుగా ఎదగాలి

వ్యాపారవేత్తలుగా ఎదగాలి

వీధి వ్యాపారులతో ఫుడ్‌ మేళా

పాల్గొన్న ఎమ్మెల్యే బీఎమ్మార్‌

తాండూరు టౌన్‌: వీధి వ్యాపారులు స్వయం శక్తితో వ్యాపార వేత్తలుగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్‌, మెప్మా ఆధ్వర్యంలో పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వీధి వ్యాపారులతో ఫుడ్‌ మేళా ఏర్పాటు చేశారు. స్టాల్స్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులు భవిష్యత్‌లో పెద్ద వ్యాపారులుగా అభివృద్ధి చెందాలన్నారు. పట్టుదల, శ్రమతో సాధించనిది ఏదీ లేదని, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అనేక మంది చిరు వ్యాపారులుగానే జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. వీధి వ్యాపారుల అభ్యున్నతికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీరశైవ సమాజానికి అండగా ఉంటా

ఇటీవల షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదానికి గురైన పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే బిఎమ్మార్‌ సందర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణం, ప్రమాదంలో సంభవించిన నష్టాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. మండపం మరమ్మతులకు ప్రభుత్వం తరఫున ఆర్థిర్ధికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి

తెలంగాణ సిద్ధాంత కర్త.. స్వర్గీయ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కృషిని మరువలేమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం చివరి వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి అని, నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సోమశేఖర్‌, ప్రభాకర్‌ గౌడ్‌, నీరజ, నాయకులు పట్లోళ్ల నర్సింలు, హబీబ్‌ లాలా, సంతోష్‌, వేణు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం

యాలాల: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రాస్నం గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అసైన్డ్‌ రైతుల భూముల్లో బోర్ల డ్రిల్లిండ్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు మండలంలో పైలెట్‌ ప్రాజెక్టుగా రాస్నం గ్రామాన్ని ఎంపిక చేశారని తెలిపారు. గ్రామ పరిధిలో సుమారు 111 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉందని, 12 యూనిట్లుగా రైతులను ఎంపిక చేసి వారి భూముల్లో బోర్లు వేసినట్లు తెలిపారు. దీంతో 69 ఎకరాలకు పైగా నీరందుతుందని, 35 కుటుంబాలు లబ్ధిపొందుతాయని వివరించారు. ఇందు కోసం రూ.9.57 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. బోర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పుష్పలీల, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు భీమప్ప, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ అధ్యక్షుడు మన్నాన్‌, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు అమృతప్ప, మాజీ సర్పంచులు హన్మంతు, మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఆరిఫ్‌ హుస్సేన్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, రఫీక్‌ తదితరులు పాల్గొన్నారు.

మొగులయ్య సేవలు మరువలేని

ఉపాధ్యాయ వృత్తిలో మొగులయ్య అందించిన సేవలు మరువలేనివని, ప్రతి ఉపాధ్యాయుడికి ఉద్యోగ విరమణ తప్పదని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అగ్గనూరు ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం మొగులయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొగులయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు వెంకట్‌రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, రాములు, మురహరినాథ్‌, ప్రభాకర్‌చారి, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement