వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం

Jun 22 2025 7:21 AM | Updated on Jun 22 2025 7:21 AM

వన మహ

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం

కొడంగల్‌ రూరల్‌: వన మహోత్సవం కోసం గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీఓ ఉషశ్రీ అన్నారు. శనివారం ఆమె మండల పరిధిలోని అప్పాయిపల్లిలో నర్సరీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనె వాతావరణం సమత్యుల్యంగా ఉంటుందన్నారు. వృక్షాలతో అటవీ సంపద పెంచడంతో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

యువకుడి అదృశ్యం

కుల్కచర్ల: ౖహెదరాబాద్‌కు వెళ్లి పని చేసుకుంటానని చెప్పి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఇప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏముకంటి మురళి(29) హైదరాబాద్‌లో మొబైల్‌ షాప్‌లో పనిచేసేందుకు వెళ్తున్నాని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లాడు. నాటి నుంచి అతని ఫోన్‌ పనిచేయకపోవడంతో ఆందోళనతో తల్లిదండ్రులు వారి బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మురళి సోదరుడు నరేశ్‌ శనివారం కుల్కచర్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మూడు టిప్పర్లు, జేసీబీ సీజ్‌

పరిగి: నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు, జేసీబీని ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకుని పరిగి స్టేషన్‌కు తరలించారు. మండల పరిధిలోని సయ్యద్‌పల్లి శివారు హిరాపూర్‌ తండాకు వెళ్లే మార్గంలో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం అర్ధరాత్రి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మూడు టిప్పర్లు, ఓ జేసీబీని పట్టుకుని పరిగి ఠాణాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లోవోల్టేజీ సమస్యకు పరిష్కారం

దుద్యాల్‌: మండల పరిధిలోని హస్నాబాద్‌ తెలుగువాడలో కొన్నేళ్లుగా లోవోల్టేజీ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు విద్యుత్‌ అధికారులకు విన్నవించగా అధికారులు స్పందించి లైన్‌మెన్‌ వెంకట్‌రాములు పర్యవేక్షణలో శనివారం నూతన ట్రాన్సఫార్మర్‌తో పాటు విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డెకరేషన్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

పహాడీషరీఫ్‌: డెకరేషన్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీలో వివాహాదిశుభకార్యాలకు వినియోగించే డెకరేషన్‌ సామగ్రి గోడౌన్‌ ఉంది. శనివారం సాయంత్రం పక్కనే ఉన్న చెత్తకుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. డెకరేషన్‌ సామగ్రిలో ప్లాస్టిక్‌, ఫైబర్‌ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జనావాసాల నడుమ ఉన్న ఈ గోడౌన్‌ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం 1
1/4

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం 2
2/4

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం 3
3/4

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం 4
4/4

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement