
ఘనంగా ప్లేస్మెంట్ అచీవర్స్ డే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం శేరిగూడలోని శ్రీదత్త విద్యా సంస్థల్లో శనివారం ప్లేస్మెంట్ అచీవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2024– 25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. విద్యా సంస్థల చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు అత్యాధునిక టెక్నాలజీలో శిక్షణ ఇస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు వందశాతం ప్లేస్మెంట్ కల్పిస్తున్నామని తెలిపారు. 46 మల్టీ నేషనల్ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తూ పాటు వందశాతం ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అకాడమిక్స్ డీన్ వెంకట అచ్యుతరావు, ప్రిన్సిపాల్ సెంథిల్కుమార్, డాక్టర్ మదుసూధన్రెడ్డి, టీపీఓ డాక్టర్ మయూరి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.