
మంత్రివర్గంలో అవకాశం కల్పించండి
ఖర్గేను కలిసి విన్నవించిన ఎమ్మెల్యే టీఆర్ఆర్
పరిగి: రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కోరారు. శనివారం ఢిల్లీ లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి ఈ మేరకు వినతి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పార్టీ మారకుండా పని చేశానని పేర్కొన్నారు. రెండు పర్యాయాలుగా డీసీసీ అధ్యక్షుడిగా సేవలందిస్తూ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల గెలుపునకు కృషి చేశానని చెప్పారు. 2017లో శక్తి కన్వీనర్గా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేశానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే పని చేయని విధంగా తాను పరిగి నియోజకవర్గ ప్రజలకు అందుబాటు లో ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి వెన్నెముక లాంటి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించి అందులో తనకు స్థానం కల్పించాలని కోరినట్లు రామ్మోహన్రెడ్డి తెలిపారు.