
ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
అనంతగిరి: వంద రోజుల ప్రణాళికలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రధాన రోడ్డులో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. వీధి వ్యాపారులతో తినుబండరాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వంటకాల రుచులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీఈ రాకేష్ రెడ్డి, మెప్మా పీడీ రవికుమార్, టీఎంసీ వెంకటేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.