
వికసించిన బ్రహ్మకమలాలు
కొడంగల్ రూరల్: పట్టణంలోని మహాదేవుని ఆలయ ఆవరణలో శుక్రవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. వాటికి ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్క తొమ్మిది అడుగుల ఎత్తు పెరిగి రెండు పూలు పూసిందని స్థానికులు తెలిపారు.
వీధి వ్యాపారులకు
బీజేపీ అండ
ఫుడ్ మేళాను సందర్శించిన
పార్టీ నాయకులు
తాండూరు టౌన్: వీధి వ్యాపారులకు బీజేపీ అండగా ఉంటుందని మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత అన్నారు. శనివారం పాత మున్సిపల్ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ఫుడ్ మేళాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో వీధిన పడిన వీధి వ్యాపారులకు చేయూతనిస్తూ, ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణా లు ఇచ్చి ఆదుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వమేనన్నారు. తాండూరు పట్టణంలో 4,623 మంది చిరు వ్యాపారులకు స్ట్రీట్ వెండర్ పథకం ద్వారా ఆదుకుందన్నారు. భవిష్యత్లో వీరంతా పెద్ద వ్యాపారులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్ లలిత, సతీష్ పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తు చేసుకోండి
అనంతగిరి: హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో 2025 – 26 సంవత్సరానికి గాను సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉచిత శిక్షణ కోసం జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 7వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదన్నారు. జూలై 13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి కలవారుదరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
చట్టాలపై
అవగాహన ఉండాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు
పరిగి: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు సూచించారు. ఽశనివారం పరిగి పట్టణంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల విద్యను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. వారిని బాగా చదివిస్తే ఉన్నత స్థానంలో నిలుస్తారని పేర్కొన్నారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే వారి ఆశయాలకు అడ్డుకట్ట వేసిన వారమవుతామని అన్నారు. ఎక్కడైన బాల్య వివాహాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్టాలపై అవగాహన ఉన్న వారు నేరాలు చేయరన్నారు. ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంట్లో మద్యపాన నిషే ధం అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగులశిల్ప, అంకిత స్వచ్ఛంద సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ డానియల్, జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్, లీగల్ ఎయిడ్ కాన్సిల్ అడ్వకెట్లు వెంకటేష్, రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

వికసించిన బ్రహ్మకమలాలు

వికసించిన బ్రహ్మకమలాలు