
యోగా ఒక జీవన విధానం
అనంతగిరి: యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో యోగా డే కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజ లు, విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలన్నారు. యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా మనిషిలో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. దేశంలో 2,500 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి ద్వారా యోగా వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి యోగా ప్రాముఖ్యతను గుర్తించి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. యోగా అన్ని వయస్సుల వారు చేయవచ్చని, గురువుల మార్గదర్శకంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవిస్తారని తెలిపారు. అనంతరం ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా క్రీడల శాక అధికారి అబ్దుల్ సత్తార్, ఎల్డీఎం యాదగిరి, అయుష్ సునీత పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
బంట్వారం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదన్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేస్తా మన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి, డైరెక్టర్లు యాదగిరి, నర్సింలు, నాయకులు మొగులయ్య, రాములు యాదవ్, రఘుపతిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాములు, హరీశ్వర్రెడ్డి, ప్రభాకర్, నర్సింలు, స్పెషల్ ఆఫీసర్ కరు ణాకర్రెడ్డి, ఎంపీడీఓ రాములు పాల్గొన్నారు.
కోట్పల్లిలో..
స్పీకర్ ప్రసాద్కుమార్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో కలిసి కోట్పల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
డబుల్ ఇళ్లు పూర్తి చేస్తాం
ధారూరు: అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయించినట్లు స్పీకర్ ప్రసాద్కుమార్ తెలిపారు. శనివారం ధారూరులో 356 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.90 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ధారూరులో అసంపూర్తిగా ఉన్న 120 డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ధారూరు మార్కె ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు భాస్కర్రెడ్డి, ఎల్.అశోక్ ముదిరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ నర్సింహులు, తహసీల్దార్ సాజిదాబేగం పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి