
వీఎంహోంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
హుడాకాంప్లెక్స్: శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే విధానమే యోగా అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోం మైదానంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకలకు ఎంపీతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. యోగా గురువులు ఆసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రశాంతంగా జీవించాలంటే యోగా అవసరమన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రాచీన ఆధ్యాత్మిక పతంజలి యోగాను నిత్యం అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుజీత, ఇన్స్పెక్టర్లు సైదిరెడ్డి, వినోద్కుమార్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.