సమ్మెలో కొనసాగుతున్నారు
ఈ నెల 16వ తేదీ నుంచి సొసైటీ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతున్నారు. దీంతో రైతులకు సేవలు అందించలేకపోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఏడు రోజులుగా కొనసాగుతున్నారు. మరో రెండు రోజుల్లో సమ్మె సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలోని 58 సింగిల్విండోలు మూతపడ్డాయి. దీంతో అన్నదాతలకు ఎటువంటి సేవలు అందించలేకపోతున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. – నాగవర్ధిని, జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధికారి


