బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు పట్టణంలోని రంగనాయకులపేటలో నివాసం ఉంటున్న బీఈడీ చదువుతున్న విద్యార్థిని ఆమంచి భార్గవి(24) యువతి ఆదివారం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీప్రసాద్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


