భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం.. ఆగ్రహించిన భర్త  | - | Sakshi
Sakshi News home page

భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం.. ఆగ్రహించిన భర్త 

Apr 24 2023 1:14 AM | Updated on Apr 24 2023 11:18 AM

- - Sakshi

తిరుపతి: భార్య కొంత కాలంగా విడిగా ఉంటూ మరొకరితో సహజీవనం చేస్తుండడంతో ఆగ్రహించిన భర్త ఆమెను కత్తితో పొడిచిన సంఘటన ఆదివారం రాత్రి నెర్నూరు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు వరదానగర్‌కు చెందిన తగరామూడి నాగరాజు అనే వ్యక్తికి శ్రావణి అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య మూడు నెలల క్రితం వివాదాలు నెలకొనడంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె గాంధీనగర్‌కు చెందిన వేంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలసి గూడూరు రూరల్‌ పరిధిలోని నెర్నూరు ప్రాంతంలోని మిరపతోటలో పనికి వచ్చారు.

ఈ విషయం తెలిసిన నాగరాజు కత్తి తీసుకుని నేరుగా నెర్నూరు సమీపంలో మిరప తోట వద్దకు చేరుకుని ఆమైపె దాడి చేసి, విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయ్యింది. అతడిని అడ్డుకున్న వేంకటేశ్వర్లును సైతం గాయపరిచాడు. అనంతరం నాగరాజు అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి ఆమె గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలిచే సరికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ దశరథరామారావు, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement