
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను www.bse. telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 38 వేల మంది హాజరయ్యారు.