నిర్మల్ జిల్లా: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ జీపు బోల్తా పడి నలుగురు దుర్మరణం చెందారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా జీపు బోల్తా పడటంతో నలుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్టీ(బి) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని బైంసా ఏరియా హాస్పిటల్కు తరిలించి చికిత్స అందిస్తున్నారు.


