సాక్షి, హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో సోమవారం ఘోరం జరిగింది. ఆసుపత్రి బిల్డింగ్లో పనిచేస్తుండగా సెంట్రింగ్ కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈఎస్ఐ(ESI) హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డులో రెన్నోవేషన్ పనులు చేస్తుండగా స్లాబ్ ఉచ్చులు మీద పడ్డట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


