మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో మళ్లీ పెద్ద పులి దర్శనమిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం నాగర్కర్నూల్ జిల్లా ఫర్హాబాద్ చౌరస్తా నుంచి సఫారీ వాహనంలో బయలుదేరుతున్న పర్యాటకుల వాహనానికి ఎదురుగా గుండం అటవీ పరిసర ప్రాంతంలో పెద్దపులి కనిపించింది. అది గమనించిన సఫారీ వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపి పర్యాటకులకు తెలియజేశాడు.


