హైదరాబాద్: బంజారాహిల్స్ ఆదివారం పూట సరదాగా హోటల్ నుంచి నాన్ వెజ్ ఐటమ్ తెప్పించుకున్న ఓ పోలీసు అధికారికి చేదు అనుభవం ఎదురైంది. కుళ్లిపోయిన మాంసంతో తయారు చేసిన ఖీమాతో వచ్చిన పార్సల్ చూసి ఆ అధికారి షాక్ కు గురయ్యారు. వివరాలకు వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 లో తెలుగు మీడియం పేరుతో రెస్టారెంట్ ఉంది.
ఆదివారం మధ్యాహ్నం ఓ పోలీస్ అధికారి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఈ హోటల్ నుంచి మటన్ కీమా తో పాటు మరికొన్ని నాన్ వెజ్ ఐటమ్ లు తెప్పించుకున్నాడు. పార్సల్ విప్పి చూడగా మటన్ ఖీమా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలుగు మీడియం రెస్టారెంట్ కి చేరుకొని ఆహార పదార్థాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. మిగిలిపోయిన ఖీమా తదితర ఆహార పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఈ శాంపిల్స్ అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


