తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు | Telangana HC Hearing On Teachers Transfer Govt Order 317 | Sakshi
Sakshi News home page

జీవో 317పై స్టేకి హైకోర్టు నిరాకరణ!.. వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు

Jan 18 2022 8:41 PM | Updated on Jan 18 2022 8:41 PM

Telangana HC Hearing On Teachers Transfer Govt Order 317 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ మొదలైంది. ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడే జరగాలని ఈ సందర్భంగా బెంచ్‌ స్పష్టం చేసింది.

జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరపు న్యాయవాదులు కోరగా.. కొత్త జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు విధుల్లో చేరారని  అదనపు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో జీవో 317పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ..  ఉపాధ్యాయుల పిటిషన్లపై తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement