Enumamula: Red chilli sold at record price of Rs 80,000 per quintal - Sakshi
Sakshi News home page

ఎనుమాముల మిర్చి సెన్సేషన్‌: క్వింటాల్‌ 80 వేలు.. గంటలో 3వేల బస్తాల అమ్మకం

Jan 6 2023 11:34 AM | Updated on Jan 6 2023 1:02 PM

Red chilli sold at record price of Rs 80000 per quintal - Sakshi

ఆసియాలో రెండో అతిపెద్ద మార్కెట్‌ అయిన ఎనుమాముల ఎండు మిర్చి విషయంలో మరో.. 

సాక్షి, వరంగల్ జిల్లా : మార్కెట్‌లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ నడుస్తోంది. దిగుమతి తక్కువ కావడం, డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతోంది. తాజాగా క్వింటాల్‌ మిర్చి ధర రూ.80 వేలకు పలికి రికార్డు నెలకొల్పింది. 

ఎర్రబంగారం ఎండు మిర్చి రికార్డు స్థాయి రేటు రాబట్టింది. తాజాగా ఆసియా ఫేమస్‌ అయిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి అధిక రేటు పలికింది. క్వింటాల్‌కు ఏకంగా రూ. 80,100 ధర పలికింది. గంటన్నరలోనే 3వేల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా మార్కెట్ చరిత్రలోనే కాదు.. రికార్డ్‌ ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గత సెప్టెంబర్‌లోనే ఎండు మిర్చి క్వింటాల్‌ రూ. 90వేల రేటు పలకడం గమనార్హం.

ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఇక్కడ పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. దేశీ కొత్త మిర్చి రకానికి ఫుల్‌ గిరాకీ ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement