Dalit Bandhu: ఎమ్మెల్యే తమ్ముడికి దళితబంధు

MLA Rajaiah Brother Name in Dalit Bandhu Scheme - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌ సర్పంచ్‌గా ఉన్న సురేశ్‌ కుమార్‌

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌: పేద దళితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకంలో లబ్ధిదారుడిగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య సోదరుడు, స్టేషన్‌ఘన్‌పూర్‌ సర్పంచ్‌ తాటికొండ సురేశ్‌ కుమార్‌ ఉండటంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయనతో పాటుగా ఘన్‌పూర్‌ ఎంపీపీ భర్త, కొందరు ప్రజాప్రతినిధులున్నారు.

మండలంలో పేదవారిని కాదని, ఆర్థికంగా ఉన్న వారికి, ఎమ్మెల్యే అనుచరులనే ఎంపిక చేశారని కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్షపార్టీల నాయకులు, యువకులు సోమవారం సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా, ఎమ్మెల్యేపై వస్తున్న విమర్శలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top