MLA's Poaching Case: Telangana High Court grants bail to three accused - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్‌

Dec 1 2022 11:51 AM | Updated on Dec 1 2022 2:33 PM

Mla Poaching Case: High Court Grant Bail To Three Accuses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయాలని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement