డీఎస్సీ–98 అర్హులకు న్యాయం | Minister Sabitha Indra Reddy Assured That Justice To DSC 98 Candidates | Sakshi
Sakshi News home page

డీఎస్సీ–98 అర్హులకు న్యాయం

Sep 19 2022 1:28 AM | Updated on Sep 19 2022 1:28 AM

Minister Sabitha Indra Reddy Assured That Justice To DSC 98 Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ–98 అర్హులందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినట్టు డీఎస్సీ–98 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ తెలిపారు. తమ సమస్యలపై ఆదివారం మంత్రిని కలిసి వివరించినట్టు తెలిపారు. అర్హత ఉన్నా దశాబ్దాలుగా తమకు ఉద్యోగాలు రావడం లేదని, ఈ విషయమై సీఎంకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సాధన సమితి గౌరవాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి రఘురామరాజు తదితరులున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement