చర్చలు సఫలం.. మెట్రో ఉద్యోగుల సమ్మె విరమణ

Hyderabad Metro Ticketing Employees Called Off Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో సిబ్బంది చేస్తున్న సమ్మె బాట వీడారు. తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో మెట్రో టికెటింగ్‌ ఉద్యోగులు సమ్మె విరమించారు. 

అయితే, వేతనాల అంశంలో మెట్రో టికెటింగ్‌ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరి సమ్మెపై కియోలిన్‌ అధికారులు స్పందించారు. వేతనం రూ. 20వేలు పెంచేదిలేదని స్పష్టం చేశారు. ఇక, ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top