36 కిమీ..28 నిమిషాలు! 

HYD: Traffic Police Provide Green Channel For Transport Live Orga - Sakshi

 ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్‌కు లైవ్‌ ఆర్గాన్స్

అంబులెన్స్‌కు గ్రీన్‌ ఛానల్‌ ఇచ్చిన ట్రాఫిక్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు సైబరాబాద్‌ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్‌లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి లైవ్‌ ఆర్గాన్స్‌ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్‌ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్‌ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్‌ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్‌ ఆర్గాన్స్‌ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్‌లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు

అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌లకు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్‌ వాహనాలకు ‘గ్రీన్‌ ఛానల్‌’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్‌ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్‌ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్‌ఛానల్‌ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top