మా ఆదేశాలు పాటించడం లేదు: హైకోర్టు! | High Court Serious On Telangana Govt Over Corona cases | Sakshi
Sakshi News home page

మా ఆదేశాలు పాటించడం లేదు: హైకోర్టు!

Jul 27 2020 12:48 PM | Updated on Jul 27 2020 12:51 PM

High Court Serious On Telangana Govt Over Corona cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసుల్లో తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కోర్టు వ్యాఖ్యానించింది. జూన్‌ 8 నుంచి ఒక్క ఉ‍త్తర్వును కూడా అధికారులు అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినవి అమలు చేయడం కష్టమైతే ఎందుకు వీలు కాదో చెప్పాలి అని కోర్టు కోరింది.  నిన్నటి బులెటిన్‌లో కూడా సరైన వివరాలు లేవని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏం చేయమంటారో రేపు సీఎస్‌నే అడుగుతామని పేర్కొంది. కరోనా కేసులన్నింటిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 

చదవండి: ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం : హైకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement