రక్తదాతల సేవ అమోఘం: గవర్నర్‌ | Governor Jishnu Dev Varma inaugurates blood donation camp on World Blood Donor Day | Sakshi
Sakshi News home page

రక్తదాతల సేవ అమోఘం: గవర్నర్‌

Jun 15 2025 2:42 AM | Updated on Jun 15 2025 2:42 AM

 Governor Jishnu Dev Varma inaugurates blood donation camp on World Blood Donor Day

రక్తదాతను అభినందిస్తున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

రాజ్‌భవన్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిష్ణుదేవ్‌ వర్మ

సాక్షి, హైదరాబాద్‌: నిస్వార్థ సేవనే ప్రజల జీవి తాన్ని కాపాడుతుందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్క రించుకుని శనివారం రాజ్‌భవన్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రక్తదానం చేయడం సేవగా గుర్తించాల న్నారు. రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలి పారు. అత్యవసర సమయాల్లో రక్తం కావాల్సిన వారికి ఈ దాతలు ఇచ్చిన రక్తం ఎంతో ఉపయోగ పడుతుందని వ్యాఖ్యానించారు.

స్వచ్ఛంద రక్త దానం చేసే వారిని, వారిని మోటివేట్‌ చేసిన వారిని గవర్నర్‌ అభినందించారు. డాక్టర్లు, రెడ్‌క్రాస్‌ వలంటీర్లు రక్తాన్ని సురక్షితంగా తీసుకోవడమేకాక, భద్రపరచడాన్ని ప్రశంసించారు. ఈ రక్తదానంలో రాజ్‌భవన్‌ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాలు పంచుకోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. రక్తదానం చేసిన వారికి, ఎన్జీవో సంఘాలకు సర్టిఫికె ట్‌లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement