హైదరాబాద్: ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుందని, పలువురు మంత్రులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక ఒక రోజు ముందుగానే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వీరి కోసం పలువురు ఆహారం పంపిణీ చేశారు.


