Hyderabad: మాదాపూర్‌లో నడిరోడ్డుపై నోట్లకట్టలు.. ట్రాఫిక్‌ జామ్‌.. తీరా చూస్తే..

Fake Currency Notes Found In Madhapur Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లో నకిలీ 2000 నోట్ల కలకలం సృష్టించాయి. 100 ఫీట్‌ రోడ్‌కు సమీపంలోని కాకతీయ రోడ్డులో గుట్టలుగుట్టలుగా 2000 నోట్లు ఉండడంతో స్థానికులు, వాహనాదారులు నోట్ల కోసం ఎగబడ్డారు. ఎవరికి అందిన కాడికి వారు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంతసేపు ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయ్యింది.  తీరా ఆ నోట్లపై చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండడంతో వాటిని తీసుకున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

చదవండి: ('పుంజు'కున్న ధరలు.. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top