Elections : ఆనాడు 'ఓటుకు నోటు' అనే మాటే లేదు!

Electoral Reforms are required to save the democracy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల ఖర్చు ఏ మేరకు ఉండాలి, పరిమితిని ఎలా విధించాలి, అనే అంశంపై ఎన్నో ఏళ్ళుగా చర్చ నడుస్తోంది. ఈ దిశగా అభిప్రాయాలు చెప్పండంటూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు గతంలో లేఖ కూడా రాసింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో గరిష్ఠ వ్యయ పరిమితిపై పార్టీలు సలహాలు, సూచనలు ఇవ్వాల్సి వుంది. ప్రస్తుతం అభ్యర్థులు పెట్టే ఖర్చుపై పరిమితి ఉంది. దీన్ని పునఃపరిశీలించే విధంగా సుమారు మూడేళ్ల క్రితం ఇద్దరు సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఓటర్ల సంఖ్య పెరుగుదల, వ్యయ ద్రవ్యోల్బణ సూచిలో అభివృద్ధి మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిమితిని సవరించే అవకాశం ఉంది. గతంలో 2014లో ఒకసారి సవరించారు. మళ్ళీ సవరించాల్సి వుంది. లోక్‌సభ సభ్యుల ఖర్చు రూ.70లక్షలు, శాసనసభ సభ్యుల ఖర్చు 28లక్షలు గరిష్ఠ పరిమితిగా మొన్నటి దాకా ఉంది. ఆ మధ్య బీహార్ లో ఎన్నికలు జరిగిన సందర్భంలో వ్యయ పరిమితిని 10శాతం పెంచారు. ఈ లెక్కప్రకారం లోక్ సభ అభ్యర్థి ఖర్చు పరిమితి -77లక్షలు, శాసనసభ అభ్యర్థి ఖర్చు -30.8లక్షలు అయ్యింది.

అయితే భవిష్యత్తులోనూ ఇదే విధానం సర్వత్రా ఉండే అవకాశాలు లేవు. రాష్ట్రాలను బట్టి కూడా పరిమితిని సవరించే విధానం వుంది. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుంటారు. 2019 నాటికి దేశ వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 83.4కోట్ల నుండి 91కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 92.1కోట్లు ఉంది. వ్యయ ద్రవ్యోల్బణ సూచి 2019 నుంచి 280కు, ప్రస్తుతం 301కి పెరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, పార్టీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకొని, తుది సవరణ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎన్నికల ఖర్చు అనే అంశం చాలా చర్చనీయాంశమైంది. ఎన్నికల ఖర్చు ఆకాశాన్ని అంటుతోంది. బాగా డబ్బున్నవాడు తప్ప సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు లేనేలేవు.

కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్న ఈ ఖర్చు అధికారికమైన లెక్క మాత్రమే.. అసలు నిజంగా అయ్యే ఖర్చు దీనికి ఎన్నో రెట్లు ఉంటుంది. ఒకప్పుడు సామాజిక సేవ, దేశభక్తి ఆశయాలుగా, సత్ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. వారంతా ఉత్తమ సంస్కారం ఉండి, విలువలు కలిగిన వ్యక్తులు. ఓటర్లు కూడా కేవలం  పార్టీయే కాకుండా, ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థిని బట్టి ఓట్లు వేసే సంస్కృతి ఉండేది. అప్పుటి ఎన్నికల ఖర్చు నామ మాత్రమే. ఇంత మీడియా లేదు.

ఇన్ని సర్వే సంస్థలు లేవు. ఇంతమంది పవర్ బ్రోకర్లు లేరు. "ఓటుకు నోటు" అనే మాటే లేదు. ఓట్లకు అమ్ముడుబోయే నీచ సంస్కృతి ఓటర్లలో  లేనే లేదు. పార్టీలు, సిద్ధాంతాలు ఏవైనప్పటికీ, చాలామంది నాయకులు విలువల పునాదులపైనే నడిచేవారే ఎక్కువశాతం  ఉండేవారు. క్రమంగా, ప్రతి వ్యవస్థలో కాలుష్యం పెరిగిపోయింది. విలువల స్థానంలో 'వెల' వచ్చి చేరింది. పవర్ సెంటర్లు పెరుగుతూ వచ్చాయి. బడా కంపెనీల పెట్టుబడులు ప్రవేశించాయి.

పార్టీ ఫండ్ రూపంలోనూ, అభ్యర్థి వ్యక్తిగత స్థాయి రూపంలోనూ ఫండింగ్ సంస్కృతి వచ్చి చేరింది. గత 40-50ఏళ్ళల్లో గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రెండు దశాబ్దాల నుంచి అది ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఊహాతీతమైన రూపు దాల్చుకుంది. కార్పొరేట్ రంగాలు, వ్యాపారవేత్తలు  రాజకీయాల్లోకి రావడం మొదలైంది. లేదా తమ మనుషులను ఎన్నికల్లో నిలబెట్టడం జరుగుతోంది. రాజ్యసభ ఎంపిక విధానం మరో రూపం దాల్చింది. ఏది ఏమైనా, డబ్బే రాజ్యమేలుతోంది.

ఒకటి: తమల్ని తాము రక్షించుకోవడం,
రెండు: తమ వ్యాపార పరిధులను  పెంచుకోవడం,
మూడు: ప్రత్యర్థులను దెబ్బతీయడం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి చేరే వారి సంఖ్య పెరుగుతోందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు?

ఈ నేపథ్యంలో పెద్దలు ఆవేదన చెందుతున్నారు. మీడియా రూపం కూడా మారుతూ వస్తోంది. రాజకీయం కూడా వ్యాపార-అధికార సమాగమంగా మారిపోయింది. పెట్టుబడుల కేంద్రంగా రూపాన్ని మార్చుకుంది. ఈ నేపథ్యంలో, పోటాపోటీగా ఎన్నికల ఖర్చు పెరిగింది.

ప్రతి వ్యవస్థను 'కొనడం, అమ్మడం, అమ్ముడుపోవడం' ఇవే మూల సూత్రాలుగా, ప్రముఖ కేంద్రాలుగా మొత్తం రూపురేఖలు మారిపోయాయనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రతి దశ డబ్బుమయమై పోయిందనే ఆవేదన చెందేవారు పెరిగిపోతున్నారు. వీటన్నిటి పర్యవసానమే నేడు దేశం ఎదుర్కొంటున్న వివిధ సంక్షోభాలు, కుంభకోణాలు. ఎన్నికల్లో సంస్కరణలు రావాలని మేధావులు మొత్తుకోవడం తప్ప, ఎటువంటి చలనం లేదు. ఇంత ఘోరమైన క్రీడ సాగుతూవుంటే, అధికారికంగా పైకి కనిపిస్తున్న వ్యయ పరిమితుల వివరాలు వాస్తవాలకు సుదూరాలు.

నిజం చెప్పాలంటే.. పద్ధతిగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా, ఒకప్పటిలాగా  ఎన్నికలు జరిగితే  ఖర్చు లక్షల్లోనే  ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ రూపొందించిన వ్యయ విధానం శాస్త్రీమైందే. ప్రస్తుతం విధించిన పరిమితికి అదనంగా 20%-30% పెంచితే సరిపోతుందని నిపుణుల అభిప్రాయం. కాకపోతే, ప్రస్తుత రాజకీయ, సామాజిక సంస్కృతిలో ఇది ఏ మాత్రం ఆచరణీయం కాదు. అసెంబ్లీ అభ్యర్థికి కనీసం 5 నుంచి 10కోట్లు, లోక్ సభ అభ్యర్థికి 25కోట్ల నుండి 100కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలోనే నేటి ఎన్నికల వ్యవస్థ ఉంది. అధికారిక పరిమితి లెక్కలకు, అనధికారికంగా పెట్టే ఖర్చుకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఆ విషయం అందరికీ తెలిసిందే.

రాజకీయాల్లో అవినీతిపరులు, అక్రమార్కులు ఉన్నంతకాలం ఎన్నికల ఖర్చు పెరగడం తప్ప, తగ్గడం అసాధ్యమనే చెప్పాలి. మొత్తంగా వ్యవస్థల్లోనే పెనుమార్పులు, సంస్కరణలు  రానంతకాలం ఎన్నికల ఖర్చు అదుపులో ఉండే అవకాశమే లేదు. కాకపోతే, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఒక నియమావళి ఉంటుంది కాబట్టి ఈ విషయాలు మాట్లాడుకోవడమే. నిజంగా.. ఎన్నికల్లో ఖర్చు తగ్గితే ఆ రోజు నుంచే  విలువల ప్రస్థానం ప్రారంభమైనట్లు చెప్పాలి. నేటి సమాజంలో అది అత్యాశే అవుతుంది. మార్పు రావాలని బలంగా అభిలషించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు.

- మాశర్మ, సీనియర్‌ జర్నలిస్టు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-11-2023
Nov 16, 2023, 11:24 IST
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి దండెం రాంరెడ్డి బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌...
16-11-2023
Nov 16, 2023, 11:24 IST
సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్‌ బరిలో నిలిచిన బీఆర్‌ఎస్‌, బీఎస్పీ అభ్యర్థులు...
16-11-2023
Nov 16, 2023, 10:49 IST
రోడ్‌ షోలు, బహిరంగ సభలు అత్యధికంగా నాంపల్లి నుంచి 34 మంది కంటోన్మెంట్‌ నుంచి అత్యల్పంగా 10 మంది.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇదీ పరిస్థితి ఎన్నికలకు...
16-11-2023
Nov 16, 2023, 10:46 IST
ఆదిలాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిక్కెట్‌ను ఆశించిన గండ్రత్‌ సుజాత నిరాదరణకు గురయ్యారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ కంది...
16-11-2023
Nov 16, 2023, 10:37 IST
సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో...
16-11-2023
Nov 16, 2023, 09:59 IST
సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని మాత్రం ఓ పాట ఆకర్షిస్తోంది. అన్ని...
16-11-2023
Nov 16, 2023, 09:38 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/జెడ్పీసెంటర్‌ /జడ్చర్ల/ దేవరకద్ర: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అసెంబ్లీ...
16-11-2023
Nov 16, 2023, 08:28 IST
సాక్షి,ఆదిలాబాద్‌: ‘ఆదివాసీ, లంబాడాలు కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్ల లాంటివారు.. 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు లంబాడాలకు, ఆరు ఆదివాసీలకు...
16-11-2023
Nov 16, 2023, 07:25 IST
యాదగిరిగుట్ట రూరల్‌: ‘నేను ఓట్లు అడుక్కోవడానికి వచ్చాను.. మీ దయ ఉంటే ఓట్లు వేయండి.. లేదంటే లేదు’ అని ఆలేరు...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
వెంగళరావు నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మాత్రమే నగరం అభివృద్ధి చెందిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం...
16-11-2023
Nov 16, 2023, 06:27 IST
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఏ– ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌న్‌ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్‌ –జూబ్లీహిల్స్‌’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న...
16-11-2023
Nov 16, 2023, 06:14 IST
● అసెంబ్లీ ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ● ఆసిఫాబాద్‌లో 17 మంది.. సిర్పూర్‌లో 13 మంది ●...
16-11-2023
Nov 16, 2023, 06:12 IST
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాజకీయాల్లోనూ పదవీ విరమణ ఉండాలి. పెరిగిన వయస్సు ఉద్యోగానికి పనికి రానప్పుడు రాజకీయాల్లో ఎలా పనికి...
16-11-2023
Nov 16, 2023, 06:12 IST
● అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహించాలి ● ‘సాక్షి’తో విశ్రాంత ఉద్యోగులు ప్రజా ఎజెండా ఆసిఫాబాద్‌: ‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అర్హత...
16-11-2023
Nov 16, 2023, 06:08 IST
● జిల్లా ఎన్నికలాధికారి ఆశిష్‌ సాంగ్వాన్‌ నిర్మల్‌చైన్‌గేట్‌: కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌...
16-11-2023
Nov 16, 2023, 06:08 IST
● సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంఽఽథా రాష్ట్ర కార్యదర్శి సూర్యం పాతమంచిర్యాల: ఫాసిస్టు బీజేపీ, నియంతృత్వ బీఆర్‌ఎస్‌ పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ...
16-11-2023
Nov 16, 2023, 06:08 IST
● ముగిసిన ఉపసంహరణ గడువు ● అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిర్మల్‌చైన్‌గేట్‌/భైంసా/ముధోల్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం...
16-11-2023
Nov 16, 2023, 06:08 IST
తాండూర్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికలు సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ...
16-11-2023
Nov 16, 2023, 06:06 IST
పరోక్షంగా బరిలో.. ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు మహిళా నేతలకు పార్టీ టికెట్లు దక్కలేదు. దీంతో పార్టీ కండువాలు...
16-11-2023
Nov 16, 2023, 05:27 IST
సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ...



 

Read also in:
Back to Top