తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు | cm revanth reddy comments on Telangana RTC Employees Strike | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Apr 23 2026 6:38 PM | Updated on Apr 23 2026 7:20 PM

cm revanth reddy comments on Telangana RTC Employees Strike

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోద్దు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టింది’ అని వ్యాఖ్యానించారు.

కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్‌.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు  రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement