Hyderabad: రాజాసింగ్కు షాక్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బిగ్ షాక్ తగిలింది. నగరంలోని కంచన్బాగ్ పోలీసు స్టేషన్లో రాజాసింగ్పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఐపీసీలోని 295ఏ సెక్షన్ కింద కేసు ఫైల్ చేసినట్టు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్రావుపై కేసు నమోదు