ఎంపీ సోయం బాపురావుకు అస్వస్థత! | BJP MP Soyam Bapurao Admitted In Nizamabad Hospital Following Ill Health | Sakshi
Sakshi News home page

ఎంపీ సోయం బాపురావుకు అస్వస్థత!

Jul 27 2020 2:14 PM | Updated on Jul 27 2020 2:43 PM

BJP MP Soyam Bapurao Admitted In Nizamabad Hospital Following Ill Health - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పీఏతో పాటు ఇద్దరు గన్‌మెన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తెలిపారు. అయితే, సోయం బాపురావు అనారోగ్యానికి గల కారణాలు తెలియరాలేదు.
(మా ఆదేశాలు పాటించడం లేదు: హైకోర్టు!)

Advertisement
 
Advertisement
Advertisement