గుండెపోటుతో ఆర్మీ మేజర్‌ మృతి | army major died of heart attack in hanamkonda district | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఆర్మీ మేజర్‌ మృతి

Jan 15 2023 1:26 AM | Updated on Jan 15 2023 1:26 AM

army major died of heart attack in hanamkonda district - Sakshi

సాయికిరణ్‌ 

పరకాల: పండుగ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వారం క్రితం సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆర్మీ మేజర్‌ దూడపాక సాయికిరణ్‌ (31)గుండెపోటుతో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా పరకాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పరకాల పట్టణంలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి దూడపాక పోశయ్య, సుశీల దంపతులకు సాయికృష్ణ, సాయికిరణ్‌లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరినీ చిన్నప్పుడే తండ్రి గోల్కొండ సైనిక్‌ స్కూల్‌లో చేర్చారు. ప్రస్తుతం సాయికిరణ్‌ అమృత్‌సర్‌ లో మేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా సోదరుడు సాయికృష్ణ జోధ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు.

సాయికిరణ్‌కు 5 ఏళ్ల క్రితం అపూ ర్వతో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాలు కుమారుడు ఉన్నాడు. సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 7న సాయికిరణ్‌ పరకాలకు చేరుకున్నాడు. అంతకన్నా ముందే సోదరు సాయికృష్ణ కూడా సెలవుల్లో ఇంటికి వచ్చాడు. కాగా, సాయికిరణ్‌ శనివారం బూత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. ఆదివారం సాయికిరణ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పరకాల సీఐ పుల్యాల కిషన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement