నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు | Adilabad: Mesrams Set Out Walk To Fetch Holy Water | Sakshi
Sakshi News home page

నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు

Jan 2 2023 12:39 AM | Updated on Jan 2 2023 8:51 AM

Adilabad: Mesrams Set Out Walk To Fetch Holy Water - Sakshi

గంగాజలం కోసం వెళుతున్న మెస్రం వంశీయులు

ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు పడింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించే నాగోబా మహా పూజకు గంగాజలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం బయల్దేరి వెళ్లారు. ఏడు రోజులపాటు మెస్రం వంశీయులున్న గ్రామాల్లో నాగోబా మహాపూజ, గంగాజలం సేకరణపై ప్రచారం నిర్వహించి కేస్లాపూర్‌ చేరుకున్నారు.

ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు అదివారం కేస్లాపూర్‌ గ్రామానికి చేరి నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌ ఆధ్వర్యంలో సమావేశమై గంగాజలం పాదయాత్ర, నాగోబా మహాపూజ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఝరి (కలశం) దేవతకు మెస్రం వంశీయులు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం గంగాజలం సేకరణ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు బుందో పట్టగా... మెస్రం వంశీయులు కానుకలు వేసి ముందుకు సాగారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement