తెలంగాణలో కొత్తగా 1,440 పాజిటివ్‌ కేసులు | 1440 New Coronavirus Positive Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1,440 పాజిటివ్‌ కేసులు

Nov 8 2020 9:51 AM | Updated on Nov 8 2020 10:14 AM

1440 New Coronavirus Positive Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 42,673 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,440 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,50,331కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1377కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 

నిన్న ఒక్క రోజే 1,481 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,29,064కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,890 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 17,135 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 46,18,470కి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement