సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలోని కై లాస ధ్యాన పీఠం కుంభాభిషేక (ప్రతిష్ఠాపన) మహోత్సవంలో స్వామి నిత్యానంద పాల్గొననున్న నేపథ్యంలో, ఆయనకు తగిన భద్రత కల్పించాలని కై లాష్ ఆధ్యాత్మిక బృందం పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామిని కోరింది. శుక్రవారం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. 2027లో పుదుచ్చేరిలోని ఎంబళం వద్ద నిత్యానంద కై లాష్ ధ్యాన పీఠంలో వైభవంగా కుంభాభిషేక వేడుకలు జరగనున్నాయని వివరించింది. ఈ కార్యక్రమానికి స్వామి నిత్యానంద స్వయంగా హాజరవుతున్నందున, ఈ మేరకు అనుమతులు , ఇతర ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వంతో కలసి పూర్తి చేస్తున్నామని వివరించింది. ఈ సందర్భంగా కై లాసం ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యతను వివరించే కై లాస పుస్తకాన్ని సీఎం రంగస్వామికి బహుకరించింది. అనంతరం పుదుచ్చేరి అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ అన్బళగన్, మంత్రి రాజవేలు తదితరులకు ఆహ్వాన పత్రికలను అందించింది.


