నిండ్ర: మండలంలోని నేతమ్స్ షుగర్ ప్యాక్టరీ యాజమాన్యం రైతులకు ఇవ్వవలసిన బకాయిలు చెల్లించాలని నేతాజీ రైతు సంఘం నేతలు ఆదినారాయణరెడ్డి, జనార్దన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు రైతులతో సమావేశం నిర్వహించారు. బకాయిలు ఆరేళ్లు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం కూడా స్పందించడం తేదని మండిపడ్డారు. ఈనెల16న అందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చెరకు రైతు నాయకులు పాల్గొన్నారు.


